ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం పరిధిలోని యాదమరి, కండ్రిగ ప్రాంతంలో ప్రతిష్టాత్మక 'సంజీవని హెల్త్ కేర్ ప్రాజెక్ట్' (Sanjeevani Healthcare Project) విస్తరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా పాల్గొన్నారు. ఇప్పటివరకు కుప్పం, నరవారిపల్లె నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్గా విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.<br /><br />ఈ పర్యటనలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కె. మురళీ మోహన్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తదితర ప్రముఖులు సీఎం చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు.<br /><br />#ChandrababuNaidu #SanjeevaniProject #APHealthReform #Puthalapattu #DigitalHealthProfile #APGovt #NaraChandrababuNaidu #Chittoor #PreventiveHealthcare #andhrapradesh
